Balakrishna VS Jr. NTR : NTR ఘాట్ వద్ద మరోసారి బయటపడ్డ ఎన్టీఆర్, బాలకృష్ణ విభేదాలు.. “ఇప్పుడే వాడి ఫ్లెక్సీలు తీసేయ్” బాలకృష్ణ

హైదరాబాద్ : సీనియర్ నటుడు(Balakrishna), ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) 28 వ వర్థంతి సందర్భంగా ఈరోజు తెల్లవారు జమునా ఎన్టీఆర్ (Jr. NTR), కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ఎన్టీఆర్ కి ఘన నివాళి అర్పించారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 18 January 2024, 12:14 PM IST

హైదరాబాద్ : సీనియర్ నటుడు(Balakrishna), ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) 28 వ వర్థంతి సందర్భంగా ఈరోజు తెల్లవారు జమునా ఎన్టీఆర్ (Jr. NTR), కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ఎన్టీఆర్ కి ఘన నివాళి అర్పించారు. అనంతరం బాలకృష్ణ కూడా తండ్రి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. ఇక్కడే ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. కొంత కాలంగా బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్ కుంటుబికులకు మధ్య విబేదాలు బయటపడుతు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈరోజు జరిగిన సంఘటన చూస్తూ అది నిజమే అని స్పష్టంగా తెలుస్తుంది. ఇక విషయంలోకి వెలితే.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్.. కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలు తొలగించారు.

ఆ ఫ్లెక్సీల్లో ఎక్కడా కూడా బాలకృష్ణ ఫోటో కూడా లేదు. కేవలం సీనియర్ ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ, జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రమే ఉండటంతో.. బాలకృష్ణ ఆదేశాల మేరకు బాలకృష్ణ అనుుచరులు ఎన్టీఆర్ ఘాట్ నుంచి ఫ్లెక్సీలను తొలగించారు. ఇక ఈ ఘటనతో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య గ్యాప్ మరింత పెరిగింది. గతంలో కూడా స్కిల్ డెవలప్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ విషయంలో కూడా నందమూరి కుంటుంబానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా స్పందించారు. విదేశాలో ఉన్న వారి కుంటుంబ స‌భ్యులు కూడా స్పందించారు. కానీ హైదరాబాద్ లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ‌్ రామ్ మాత్రం సైతం మౌనంగా ఉండిపోవడంతో నందమూరి, నారా కుటుంబాలకు పెద్ద షాకే తగినట్లు అయ్యింది. చంద్రబాబు అరెస్ట్ విషయంలో.. ఆయన కంటి ఆపరేషన్ విషయంలో తారక్ స్పందించక పోవడంతో ఓ మీడియా విలేకర్ అడగాగా.. బాలకృష్ణ బహిరంగంగానే ఐ డోంట్ కేర్ అంటూ సమాదానం ఇచ్చిన సంగతి తెలిసిందే.

Published : 
  • 18 January 2024, 12:14 PM IST