తెలంగాణ బీజేపీ సంక్షోభంలో ఉంది. పార్టీలో గందరగోళం నెలకొంది. అసలే అంతర్గత కుమ్ములాటలు, కర్ణాటకలో ఓటమితో పార్టీకి భారీ నష్టం కలిగితే.. మరోవైపు అధిష్టానం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు మరింత డ్యామేజ్ చేస్తున్నాయి. ఎన్నికలపై ఫోకస్ చేసి, ప్రజల్లోకి వెళ్లాల్సిన టైంలో నేతల మధ్య పంచాయితీ తేల్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
