ఎమ్మెల్సీ కవితకు ఈడీ ఊరటనిచ్చింది. ఇవాల్టి విచారణ నుంచి వెసులుబాటు కల్పించింది. ఆమె కోరినట్లే ఎల్లుండి విచారణకు హాజరయ్యేందుకు అంగీకరించింది. దీంతో రేపటి ధర్నా తర్వాత ఎల్లుండి శనివారం ఆమె ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. అయితే ఈ విచారణలో ఆమెను ఏం ప్రశ్నించనున్నారు.. అనేది ఆసక్తి కలిగిస్తోంది. ఇప్పటికే అరుణ్ రామచంద్ర పిళ్లై ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆయన కస్టడీ 13తో ముగియనుంది. తాను కవిత బినామీయే అని రామచంద్ర పిళ్లై చెప్పడంతో ఆమెతో కలిపి విచారించేందుకు ఈడీ రంగం సిద్ధం చేసిందనే వార్తలు వస్తున్నాయి.
కవిత నుంచి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు ఈడీ సిద్ధమైంది. ఆమెను అడిగే అవకాశం ఉన్న ప్రశ్నలను ఓసారి పరిశీలిద్దాం..