తొలి టెస్టుకు ముందు రిలాక్స్, బీచ్ లో సేదతీరిన భారత క్రికెటర్లు

ఆస్ట్రేలియాతో భారత్ తొలి టెస్ట్ శుక్రవారం నుంచి ఆరంభం కానుంది. గత వారం రోజులుగా ప్రాక్టీస్ లో బిజీబిజీగా గడిపిన భారత ఆటగాళ్ళు కాస్త రిలాక్సయ్యారు.

Post Published By: Vencateshg
Updated : 20 November 2024, 1:59 PM IST

ఆస్ట్రేలియాతో భారత్ తొలి టెస్ట్ శుక్రవారం నుంచి ఆరంభం కానుంది. గత వారం రోజులుగా ప్రాక్టీస్ లో బిజీబిజీగా గడిపిన భారత ఆటగాళ్ళు కాస్త రిలాక్సయ్యారు. టీమిండియా క్రికెటర్లు బీచ్ లో సందడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కెఎల్ రాహుల్ తో పాటు ప్రసిద్ధ్ కృష్ణ, దేవదత్ పడిక్కల్, ధృవ్ జురెల్ బీచ్ పరిసరాల్లో సేదతీరుతున్న వీడియోను కెఎల్ రాహుల్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. ఇదిలాఉంటే పెర్త్ లో జరిగే మొదటి టెస్టులో కెఎల్ రాహుల్ ఆడటం దాదాపు ఖాయమైంది. రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడం, శుభమన్ గిల్ చేతివేలికి గాయమవడంతో జైశ్వాల్ తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశాలున్నాయి. అలాగే దేవ్ దూత్ పడిక్కల్ కూ తుది జట్టులో చోటు దక్కే ఛాన్సుంది.

Published : 
  • 20 November 2024, 1:59 PM IST