Massive transfer of IAS in Andhra Pradesh..
ఆంధ్రప్రదేశ్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక గత ప్రభుత్వ హయంలో ఉన్నత స్థాయి అధికారులు అందరిని కూడా కొత్త ప్రభుత్వం విధుల నుంచి తప్పస్తుంది. వారి స్థానల్లో తన ప్రభుత్వం కు కావల్సిన అధికారులను నియమించుకుంటుంది. తాజగా ఏపీలో భారీగా IASలు బదిలీ అయ్యారు. పురపాలకశాఖ, ఎక్సైజ్, పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శులు శ్రీలక్ష్మి, రజత్ భార్గవ, ప్రవీణ్ ప్రకాశ్లను ప్రభుత్వం జీఏడీకి అటాచ్ చేసింది. జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్ కుమార్లను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీ నూతన ప్రభుత్వ కార్యదర్శులు