భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ లెక్కలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఒకప్పుడు వంద కోట్లు అనేది గగనంగా ఉండేది, కానీ ఇప్పుడు వెయ్యి కోట్ల క్లబ్ అనేది ఒక బెంచ్మార్క్గా మారిపోయింది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్టర్ ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సృష్టించిన ఆల్-టైమ్ రికార్డును రణవీర్ సింగ్ తన లేటెస్ట్ సినిమాతో కేవలం 9 రోజుల్లోనే దాటేశాడా? అనేది ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. గతేడాది అట్లీ దర్శకత్వంలో వచ్చిన 'జవాన్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. షారుఖ్ ఖాన్ తన మాస్ అవతార్తో దేశవ్యాప్తంగా థియేటర్లను ఊపేశాడు.
ఈ చిత్రం లాంగ్ రన్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1160 కోట్ల రూపాయల లైఫ్ టైమ్ కలెక్షన్లను రాబట్టి బాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఈ రికార్డును బ్రేక్ చేయడం అంత సామాన్యమైన విషయం కాదని ట్రేడ్ విశ్లేషకులు భావించారు.అయితే, ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' చిత్రం సరికొత్త చరిత్ర సృష్టించినట్లు కనిపిస్తోంది.జవాన్ లైఫ్ టైమ్ కలెక్షన్ 1160 కోట్లు. ధురంధర్ 2, 9 రోజుల్లో 1173 కోట్లు కొల్లగొట్టింది. అంటే షారుఖ్ ఖాన్ తన మొత్తం థియేట్రికల్ రన్లో సాధించిన ఫిగర్ను, రణవీర్ సింగ్ కేవలం 9 రోజుల్లోనే అధిగమించాడనే వార్త ఫ్యాన్స్ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఒకవేళ ఇదే నిజమైతే, ఇండియన్ సినిమా హిస్టరీలో ఇది కనీవినీ ఎరుగని రికార్డు అవుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. అధికారికంగా 'ధురంధర్ 2' అనే సినిమా గురించి లేదా ఈ స్థాయి కలెక్షన్ల గురించి ట్రేడ్ వర్గాల నుండి ఖచ్చితమైన సమాచారం ఇంకా రావాల్సి ఉంది. బాలీవుడ్లో ఒకప్పుడు ఖాన్ల రాజ్యమే నడిచేది. కానీ ఇప్పుడు రణవీర్ సింగ్, రణబీర్ కపూర్ వంటి యంగ్ స్టార్స్ తమ మార్కెట్ను విపరీతంగా పెంచుకున్నారు. ఒకవేళ 'ధురంధర్ 2' సినిమా నిజంగానే 9 రోజుల్లో 1100 కోట్లు దాటి ఉంటే, షారుఖ్ ఖాన్ వంటి దిగ్గజాల రికార్డులు ప్రమాదంలో పడ్డట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా, భారతీయ సినిమా గ్లోబల్ మార్కెట్లో దూసుకుపోతోంది అనడానికి ఈ కలెక్షన్లే నిదర్శనం. సౌత్ సినిమాల జోరుకు తోడు, బాలీవుడ్ సినిమాలు కూడా వెయ్యి కోట్ల క్లబ్లో వరుసగా చేరుతుండటం సినిమా ప్రేమికులకు పండగే. అయితే 'జవాన్' రికార్డు నిజంగానే మాయమైందా లేదా అనేది అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.