The Chief Electoral Officer released the election schedule of four states along with Telangana
తెలంగాణతో పాటూ మిగిలిన నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వివరాలను ప్రకటించింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఏడాదితో గడువు ముగియనున్న సంగతి తెలిసిందే. 40 రోజులపాటూ 5 రాష్ట్రాల్లో పర్యటించి క్షుణ్ణంగా పరిస్థితులను అధ్యయనం చేసినట్లు తెలిపారు సీఈసీ రాజీవ్ కుమార్. అలాగే ఐదు రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులు, పార్టీల కీలక నేతలతో పలు సార్లు చర్చలు సమావేశాలు జరిపినట్లు వివరించారు. ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు గానూ గడిచిన ఆరు నెలలుగా కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే వివిధ రాజకీయ పార్టీల నుంచి కొన్ని అభిప్రాయాలను స్వీకరించామన్నారు.
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వివరాలు..
తెలంగాణలో పోలింగ్ కేంద్రాల వివరాలు ఇలా..
T.V.SRIKAR