గత కొన్ని నెలలుగా కోలీవుడ్ బాక్సాఫీస్ మరియు తమిళనాడు రాజకీయాలను ఊపేస్తున్న ఒకే ఒక్క హాట్ టాపిక్.. హీరో, తమిళగ వెట్రి కజగం అధినేత విజయ్ మరియు ఆయన భార్య సంగీతల విడాకుల వ్యవహారం. 1999లో పెళ్లి చేసుకుని, 27 ఏళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోతున్నారనే వార్త అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. అయితే, తాజాగా చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో ఈ కేసుకు సంబంధించి ఒక ఊహించని మలుపు చోటుచేసుకుంది. సంగీత తన విడాకుల పిటిషన్ను అధికారికంగా వెనక్కి తీసుకున్నారు. సరిగ్గా ఈ పరిణామం జరిగిన కొన్ని రోజులకే.. నటి త్రిష కృష్ణన్ తన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఒక క్రిప్టిక్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో నిప్పు రాజేసింది. అసలు కోర్టులో ఏం జరిగింది? త్రిష అంత ఘాటుగా ఎందుకు రియాక్ట్ అయింది?
అసలు బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే.. విజయ్ భార్య సంగీత గతేడాది ఫిబ్రవరిలోనే చెంగల్పట్టు కోర్టులో విడాకుల కోసం అప్లై చేశారు. ఆ పిటిషన్లో ఆమె పేర్కొన్న అంశాలు అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేశాయి. విజయ్కు ఒక తోటి మహిళా నటితో వివాహేతర సంబంధం ఉందని, ఆ విషయం తనకు తీవ్ర మానసిక క్షోభను, నమ్మకద్రోహాన్ని మిగిల్చిందని ఆమె ఆరోపించారు. ఆ నటితో సంబంధాన్ని తెంచుకుంటానని విజయ్ తనకు హామీ ఇచ్చి కూడా మాట తప్పారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ పిటిషన్లో ఎక్కడా నటి పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ.. విజయ్తో వరుస సినిమాలు చేస్తున్న త్రిష వైపే అందరి వేళ్లూ చూపించాయి.
అయితే, రీసెంట్గా జరిగిన వీడియో కాన్ఫరెన్స్ హియరింగ్లో సంగీత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ఈ కేసును ఇక ముందుకు తీసుకెళ్లాలని అనుకోవడం లేదని చెప్తూ.. తన విడాకుల పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు. సంగీత విడాకుల కేసును వెనక్కి తీసుకోగానే.. అందరి కళ్లూ త్రిష మీదే పడ్డాయి. ఈ నేపథ్యంలోనే త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. ఆమె తన పోస్ట్లో.. "ఈ వయసులో కూడా ఇలాంటి అనవసరమైన డ్రామాలు చేయడం నిజంగా సిగ్గుచేటు.. వెళ్లి కాస్త డబ్బులు సంపాదించుకుని ప్రశాంతంగా బతకండి" అంటూ చాలా ఘాటుగా రాసుకొచ్చింది.
దాంతో పాటు ఒక ఈవిల్ ఐ ఎమోజీని కూడా షేర్ చేసింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు మరియు తమిళ మీడియా.. త్రిష నేరుగా విజయ్ భార్య సంగీతను టార్గెట్ చేస్తూనే ఈ వ్యాఖ్యలు చేసిందని ఫిక్స్ అయిపోయారు. ఇన్నాళ్లూ తన పేరును విడాకుల వివాదంలోకి లాగి డ్రామాలు చేశారని, ఇప్పుడు కేసు విత్డ్రా చేసుకోవడంతో త్రిష ఇలా ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే త్రిష ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టిందనే దానిపై ఎలాంటి అఫీషియల్ పేరు చెప్పలేదు. కానీ, విజయ్ విడాకుల కేసు క్లోజ్ అయిన టైమింగ్లోనే ఈ పోస్ట్ రావడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. విజయ్ సీఎం అయిన తర్వాత ఆయన ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికే ఈ విడాకుల డ్రామా నడిపించారనే చర్చ కూడా సాగుతోంది.