Ukraine vs Russia War : ప్రపంచానికి తప్పిన పెను ముప్పు.. ఉక్రెయిన్ లోని అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి..

రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం (Ukraine vs Russia War) గత రెండు సంవత్సరాలుగు కొనసాగుతుంది. ఫిబ్రవరి 24 సమారు 3 గంటల సమయ్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) తూర్పు ఉక్రెయిన్ (Ukraine) లో అధికారికంగా సైనిక చర్యను ప్రకటించారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 9 April 2024, 1:29 PM IST

రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం (Ukraine vs Russia War) గత రెండు సంవత్సరాలుగు కొనసాగుతుంది. ఫిబ్రవరి 24 సమారు 3 గంటల సమయ్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) తూర్పు ఉక్రెయిన్ (Ukraine) లో అధికారికంగా సైనిక చర్యను ప్రకటించారు. సైనిక చర్య ప్రకటించిన కసేపటి తర్వత ఉక్రెయిన్ రాజదాని కైవ్ (Kyiv) తో సహా పలు నగరల్లో రష్యా క్షిపణి దాడులు ప్రారంభించింది. దీంతో అప్పటి నుంచి నేటి వరకు యుధ్ద తీర స్థాయికి చేరుకోని.. నీర్ విరామంగా సాగుతుంది.

తాజాగా ఉక్రెయిన్ లోని జపొరిజ్‌జియా అణు విద్యుత్‌ కేంద్రంపై (Nuclear power plant) ఇటీవల డ్రోన్‌ దాడి జరిగింది. దీంతో ఐక్యరాజ్యసమితి సైతం అటామిక్‌ వాచ్‌డాగ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాటిలో అను విద్యుత్ కేంద్ర ద్వంసం అయ్యిం ఉండింటే ఈ ప్రపంచానికి తీవ్ర స్థాయిలో అణు ప్రమాదం జరిగి ఉండేది.. ఇప్పుడు కూడా అవకాశం ఉన్నట్లు ఐరాస పేర్కొంది.

ఆ డ్రోన్‌ దాడి వెనుక ఉక్రెయిన్‌ హస్తం ఉన్నట్లు రష్యా వాదిస్తోంది. ఈటివలె రష్యా సైనికులను ఉక్రెయిన్ సైన్యం డ్రోన్ దాడితో శత్రువలను హతమారుస్తు వస్తుంది. దీంతో రష్యా సైతం ఈ దాడికి ముఖ్య కారణం ఉక్రెయిన్ అని ఆరోపణ చేస్తుంది. కాగా ఈ డ్రోన్‌ దాడిలో సుమారు ముగ్గురు గాయపడ్డారు. కానీ ఉక్రెయిన్‌ మాత్రం దీన్ని ఖండిస్తోంది. ఆరు అణు రియాక్టర్లు ఉన్న ఈ విద్యుత్‌ కేంద్రం ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంలో కీలకంగా మారింది. డ్రోన్‌ దాడులపై అప్రమత్తంగా ఉండాలని ఇంటర్నేషనల్‌ అటామిక్‌ ఎనర్జీ ఏజెన్సీ పేర్కొంది. చాలా నిర్లక్ష్యంగా డ్రోన్‌ దాడి చేసినట్లు ఐఏఈఏ అధిపతి రాఫేల్‌ గ్రోసి తెలిపారు.

రష్యా ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం మొదలైన తర్వాత రష్యా దళాలు అణు విద్యుత్‌ ప్లాంట్‌ ను ఆక్రమించేశాయి. 2022 ఫిబ్రవరి నుంచి ఆ ప్లాంట్‌ రష్యా ఆధీనంలోనే ఉంది. జపొరిజ్‌జియా వద్ద డ్రోన్‌ దాడి వల్ల స్వల్పంగా భౌతిక నష్టం జరిగినట్లు ఐఏఈఏ నిపుణులు వెల్లడిరచారు. అయితే ప్రస్తుతం ప్లాంట్‌ వద్ద రేడియేషన్‌ లెవల్స్‌ లేవని.. రేడియేషన్ సాధారణంగానే ఉన్నాయని, భయపడాల్సినంత నష్టం జరగలేదని ప్లాంట్‌ సిబ్బంది చెబుతున్నారు. కాగా ఈ అణు విద్యుత్‌ కేంద్రం యూరోప్‌లోనే పెద్దిగా పేరు పొందింది.

SURESH : SSM

Published : 
  • 9 April 2024, 1:29 PM IST