Tamil Nadu Premier League : టీఎన్ పీఎల్ వేలంలో సరికొత్త రికార్డు… అత్యంత ఖరీదైన ఆటగాడు అతడే

తమిళనాడు ప్రీమియర్ లీగ్ (Tamil Nadu Premier League) 8వ ఎడిషన్ వేలంలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. యువ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. టీమిండియా (Team India) ఆటగాడు సాయి కిషోర్ (Sai Kishore) రికార్డు మొత్తానికి అమ్ముడుపోయాడు. 3 లక్షల ప్రాథమిక ధరతో కనిపించిన యువ లెఫ్టార్మ్ ఆల్ రౌండర్‌ను కొనుగోలు చేసేందుకు ఎనిమిది ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 8 February 2024, 12:34 PM IST

తమిళనాడు ప్రీమియర్ లీగ్ (Tamil Nadu Premier League) 8వ ఎడిషన్ వేలంలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. యువ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. టీమిండియా (Team India) ఆటగాడు సాయి కిషోర్ (Sai Kishore) రికార్డు మొత్తానికి అమ్ముడుపోయాడు. 3 లక్షల ప్రాథమిక ధరతో కనిపించిన యువ లెఫ్టార్మ్ ఆల్ రౌండర్‌ను కొనుగోలు చేసేందుకు ఎనిమిది ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి.

దీంతో సాయి కిషోర్ విలువ క్షణాల్లోనే 15 లక్షలకు చేరుకుంది. తిరుప్పూర్ తమిళన్స్, తిరుచ్చి గ్రాండ్ చోలాస్ ఫ్రాంచైజీ మధ్య పోటీ కొనసాగింది. చివరకు 22 లక్షల వరకు అది ఉత్కంఠ చోటుచేసుకుంది. సాయి కిషోర్‌ని తిరుప్పూర్ తమిళన్స్ ఆఫర్ చేసి కొనుగోలు చేసింది.

దీంతో తమిళనాడు ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా సాయి కిషోర్ నిలిచాడు. ఇంతకుముందు టీఎన్‌పీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా సాయి సుదర్శన్ (Sai Sudarshan) రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు తర్వాత సంజయ్ యాదవ్ కూడా 22 లక్షలకు అమ్ముడై ఈ రికార్డును సమం చేశాడు. ఎడమచేతి వాటం ఆల్ రౌండర్ సంజయ్ కోసం తిరుచ్చి గ్రాండ్ చోలాస్ ఫ్రాంచైజీ భారీ మొత్తాన్ని చెల్లించింది. దీనితో పాటు తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో సాయి కిషోర్, సంజయ్ యాదవ్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. గత 7 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో 8 జట్లు తలపడుతున్నాయి.

Published : 
  • 8 February 2024, 12:34 PM IST