ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్.. రోకో జోడీపైనే ఆశలు..!

ఇంగ్లండ్ పర్యటనలో వరుస పరాజయాలతో టీ20 సిరీస్ కోల్పోయిన టీమిండియా వన్డే సిరీస్‌కు సన్నదమవుతుంది. టీమిండియా ఐకాన్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ సిరీస్‌ ఆడనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Post Published By: dialnews
Updated : 11 July 2026, 8:00 PM IST

ఇంగ్లండ్ పర్యటనలో వరుస పరాజయాలతో టీ20 సిరీస్ కోల్పోయిన టీమిండియా వన్డే సిరీస్‌కు సన్నదమవుతుంది. టీమిండియా ఐకాన్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ సిరీస్‌ ఆడనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీమిండియా పేలవ ప్రదర్శనతో టీ20 సిరీస్‌ ఏకపక్షంగా సాగగా.. వన్డే సిరీస్‌ అలా ఉండదని అభిమానులు ఆశిస్తున్నారు. అనుభవం కలిగిన కోహ్లీ, రోహిత్‌తో పాటు శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగుతుండటంతో టీమిండియా‌ను ఓడించడం ఇంగ్లండ్‌కు కత్తిమీద సామేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఐదు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. నామమాత్రపు ఆఖరి టీ20 శనివారం జరగనుండగా.. మంగళవారం నుంచి మూడు వన్డేల సిరీస్‌కు తెరలేవనుంది. బర్మింగ్‌హామ్ వేదికగా తొలి వన్డే జరగనుండగా.. జూలై 16న కార్డీప్ వేదికగా రెండో వన్డే జరగనుంది. జూలై 19న ఐకానిక్ క్రికెట్ స్టేడియం లార్డ్స్ వేదికగా ఆఖరి మ్యాచ్ జరగనుంది.

ఐపీఎల్ 2026 విజయానంతరం తొడ కండరాల గాయంతో ఆటకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ.. ఈ సిరీస్‌తోనే రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఐపీఎల్ తర్వాత అఫ్గాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు కోహ్లీ దూరంగా ఉన్నాడు. రోహిత్ శర్మ మాత్రం ఈ సిరీస్ ఆడాడు. స్వింగ్ కండిషన్స్‌లో యంగ్ ఇండియా తడబడటంతో సీనియర్లు మెరుగైన ప్రదర్శన చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కోహ్లీ, రోహిత్ శర్మ రీఎంట్రీ ఇస్తుండటంతో క్రికెట్ అభిమానులు మరియు మేనేజ్‌మెంట్ వీరిద్దరి ప్రదర్శనపైనే భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లలో యంగ్ ఇండియన్ టీమ్ ఇంగ్లీష్ స్వింగ్ కండిషన్స్‌లో తీవ్రంగా తడబడటంతో, వన్డే సిరీస్‌ను గెలిచి పరువు నిలబెట్టే బాధ్యత ఇప్పుడు ఈ ఇద్దరు దిగ్గజాలపైనే పడింది. కాగా రోహిత్ శర్మ ఐపీఎల్ సమయంలో గాయంతో ఇబ్బంది పడ్డాడు. అయితే ఇంగ్లాండ్ పిచ్‌లపై ఉండే స్వింగ్, బౌన్స్‌కు అలవాటు పడేందుకు అందరికంటే ముందే లండన్ చేరుకుని స్థానిక క్లబ్స్‌లో ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.

పీఎల్ 2026 తర్వాత గాయం కారణంగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమైన విరాట్ కోహ్లీ... ఇంగ్లాండ్‌తో జరిగే ఈ వన్డే సిరీస్‌తోనే మళ్లీ మైదానంలోకి అడుగుపెడుతున్నాడు. కోహ్లీ, రోహిత్ ఇప్పటికే అంతర్జాతీయ టీ20లు, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించేశారు. ఇప్పుడు వారి పూర్తి ఫోకస్ కేవలం వన్డేలపైనే ఉంది. 2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఆడాలనే పట్టుదలతో ఈ ఇద్దరు సీనియర్లు ఉన్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్ అజిత్ అగార్కర్ వీరి ఫిట్‌నెస్ మరియు ఫామ్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ ఇంగ్లాండ్ టూర్ వారి రోడ్ మ్యాప్‌కు ఎంతో కీలకం కానుంది.

Published : 
  • 11 July 2026, 8:00 PM IST