ఆసియా గేమ్స్‌కు భారత క్రికెట్ జట్టు, హర్మన్‌ప్రీత్ కౌర్‌పై సారథ్య బాధ్యతలు..!

ఈ ఏడాది జరగబోయే ఆసియా గేమ్స్ కోసం భారత మహిళల క్రికెట్ జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ఇటీవల జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో జట్టు

Post Published By: dialnews
Updated : 1 July 2026, 6:24 PM IST

ఈ ఏడాది జరగబోయే ఆసియా గేమ్స్ కోసం భారత మహిళల క్రికెట్ జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ఇటీవల జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, మేనేజ్‌మెంట్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై నమ్మకంతో ఆమెకే మళ్లీ సారథ్య బాధ్యతలను అప్పగించింది. స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది.

ప్రపంచకప్ జట్టుతో పోలిస్తే ఇందులో పెద్దగా మార్పులు చేయలేదు. అయితే, వికెట్ కీపర్ బ్యాటర్ యస్తికా భాటియా స్థానంలో తెలుగమ్మాయి గొంగిడి త్రిషను ఎంపిక చేశారు. అలాగే గాయపడిన శ్రేయాంక పాటిల్‌కు ఈ టోర్నీలో చోటు కల్పించారు. జపాన్ వేదికగా సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 4 వరకు ఈ ఆసియా క్రీడలు జరగనున్నాయి. 2023 చైనా ఆసియా గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన టీమిండియా, ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగుతోంది.

Published : 
  • 1 July 2026, 6:24 PM IST