PM Modi to Telangana today.. Traffic restrictions in Hyderabad..
నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షాలు.. భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా సోమవారం బేగంపేట్ నుంచి సోమాజిగూడ వరకు 30 నిమిషాల పాటు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధిస్తున్నారు. ఇక రాత్రి 7.40 నుంచి 8.10 నిమిషాల మధ్య బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి షాపర్ స్టాప్, హైదరబాద్ పబ్లిక్ స్కూల్ (Hyderabad Public School), రాజ్ భవన్ వరకు.. అలాగే 5వ తేదీ ఉదయం 9.50 నుంచి 10.15 నిమిషాల మధ్య రాజ్ భవన్ (Raj Bhavan) నుంచి బేగం పేట్ ఎయిర్ పోర్టు వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ప్రధాని మోదీ తెలంగాన పర్యటన (Telangana visit) లో.. 4,5 తేదీల్లో సంగారెడ్డి.. ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సుమారు 7 వేల కోట్ల రూపాలయ అభివృద్ధి పనులు మొదలుపెట్టనున్నారు.