ICC WORLD CRICKET CUP: కష్టాల్లో ఇండియా… మూడు వికెట్లు కోల్పోయిన భారత్

టీమిండియాా కష్టాల్లో కనిపిస్తోంది. మూడు వికెట్లు కోల్పోవడంతో అభిమానులు టెన్షన్ లో ఉన్నారు.

Post Published By: dialnews
Updated : 19 November 2023, 3:02 PM IST

ICC WORLD CUP: భారత్ - ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ లో జరుగుతున్న ICC వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా కష్టాల్లో ఉంది. ఫైనల్‌ మ్యాచ్‌లో ఇప్పటికి 3 వికెట్లు కోల్పోయింది భారత్‌. రోహిత్‌ ( 47 ), గిల్‌ ( 4) , శ్రేయస్ అయ్యర్‌ ( 4 ) ఔట్‌ అయ్యారు. ఇప్పుడు టీమ్ భారమంతా కోహ్లీ మీదే ఉంది. స్టార్క్, కమిన్స్‌, మ్యాక్స్‌వెల్‌కు చెరో వికెట్‌ దక్కాయి. టెన్షన్ పుట్టిస్తోన్న ఫైనల్‌ మ్యాచ్‌. భారత్ వరుస వికెట్లు కోల్పోవడంతో మోడీ స్టేడియంలో నిశ్బబ్ద వాతావరణం కనిపిస్తోంది. ప్రేక్షకులు టెన్షన్ లో ఉన్నారు.

Published : 
  • 19 November 2023, 3:02 PM IST