Tirumala Photo Shoot person Arrest
కేవలం ఆలయాన్ని మాత్రమే వీడియో తీశారా, లేక ఆలయ గర్భ గుడిలో కూడా వీడియోలు తీశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే రీసెంట్ గానే తిరుమల ఆలయం మీదనుంచి విమానం వెళ్లడం సంచలనంగా మారింది. నో ఫ్లైయింగ్ జోన్ నుంచి విమానం వెళ్లడం సంచలనంగా మారింది. ఈ విషయం తేలకముందే శ్రీశైలం ఆలయంపై డ్రోన్ ను గుర్తించారు స్థానికులు. ఇలా ఆలయ దగ్గర భద్రత వైఫల్యం కనిపించడం చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలోనే ఆలయ గోపురాన్ని రాహుల్ రెడ్డి వీడియో తీయడం మరోసరి సంచలనంగా మారింది. దేశంలోనే పేరుపొందిన దేవస్థానాల్లో ఒకటైన తిరుమలలో సెక్యూరిటీ చాలా పకడ్బందీగా ఉంటుంది. వేల సంఖ్యలో సీసీ కెమెరాలు ఉంటాయి. విజిలెన్స్ అధికారులను దాటి అసలు ఎలక్ట్రానిక్ వస్తువు లోపలికి ఎలా వచ్చింది అనేదే ఇప్పుడు ప్రశ్న. రాహుల్ దర్యాప్తులో పోలీస్ లు ఇంకా ఎలాంటి నిజాలు బయటికి తీస్తారో చూడాలి.