టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇంగ్లండ్ గడ్డపై హాఫ్ సెంచరీ బాదిన తొలి భారత కెప్టెన్గా నిలిచాడు. దిగ్గజ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీలకు సాధ్యం కానీ రికార్డును శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా తన మూడో మ్యాచ్లోనే అందుకున్నాడు.ఇంగ్లండ్తో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్లోనూ ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ విఫలమవడంతో త్వరగానే క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అత్యంత బాధ్యతాయుతంగా ఆడాడు. 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అంతర్జాతీయ టీ20ల్లో ఇది శ్రేయస్ అయ్యర్కు 9వ హాఫ్ సెంచరీ.ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును శ్రేయస్ అయ్యర్ అధిగమించాడు. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక టీ20 పరుగులు చేసిన భారత కెప్టెన్గా విరాట్ కోహ్లీ పేరిట ఉన్న 8 ఏళ్ల రికార్డ్ అయ్యర్ తాజా ఇన్నింగ్స్తో బద్దలైంది.విరాట్ కోహ్లీ 2018లో 47 ఇంగ్లండ్ గడ్డపై పరుగులు చేయగా.. శ్రేయస్ అయ్యర్ తాజాగా 68 పరుగులతో ఆ రికార్డును తిరగరాశాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ , ఎంఎస్ ధోని ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. శ్రేయస్ కేవలం రికార్డులకే పరిమితం కాకుండా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు.
ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో చెలరేగినా లాభం లేకుండా పోయింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయ్యింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 189 పరుగులు చేసింది.అభిషేక్ శర్మ 24 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 59, శ్రేయస్ అయ్యర్ 47 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 68 పరుగులతో రాణించగా.. శివమ్ దూబే 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 42 రన్స్ తో మెరుపులు మెరిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో సకీబ్ మహ్మూద్ మూడు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్, సామ్ కరణ్ తలో వికెట్ తీసారు. తర్వాత ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు భారీ వర్షం రావడంతో మ్యాచ్ రద్దయ్యింది.